శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన పంచ కృష్ణ క్షేత్రాలలో తిరుక్కోవిలూర్ ఒకటి. ఇక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీత్రివిక్రమ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు.
ఇక్కడే కొలువుదీరిన శ్రీమన్నారాయణుడిని, మృఖండ మహర్షి శ్రీత్రివిక్రమ పెరుమాళ్ గా పూజించాడని ప్రతీతి.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, శ్రీత్రివిక్రమ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి.
ఈ ఆలయం చోళ రాజైన పరాంతక చోళచే నిర్మించబడి ,రాజ రాజ చోళ I , రాజ రాజ చోళ II మరియు రాజేంద్ర దేవ చోళచే విశేషంగా అభివృధ్ధి చేయబడింది.
శ్రీత్రివిక్రమ పెరుమాళ్ చతుర్భాహువులతో, కుడి చేతిలో శంఖు, ఎడమ చేతిలో చక్రం ధరించి, కుడి కాలు ఆకాశం పైన పెట్టి, కుడి చేతి చూపుడు వేలుతో 1 అని చూపిస్తూ నయనమనోహరంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మి పుష్పవల్లిగా కొలువుదీరి ఉంది.
ఇక్కడే కొలువుదీరిన లక్ష్మినారాయణ, లక్ష్మినరసింహ, ఆండాళ్, ఉదయవర్, చక్రత్తాళ్వర్, వరదరాజ, వేణుగోపాల మరియు శ్రీరాముడిని దర్శించవచ్చు. ఈ ఆలయంలో శ్రీత్రివిక్రమ పెరుమాళ్ అర్చా రూపం వెనక ఉన్న చిన్న వామనమూర్తి కూడా ఉన్నారు.
ఇక్కడే కొలువైన శ్రీత్రివిక్రమ పెరుమాళ్ ఉత్సవమూర్తి కి గోపాలుడు అని పేరు.
నాదముని నాలాయిర దివ్య ఫ్రభంధం లేక ద్రవిడ వేదం ని ప్రపంచానికి మొట్టమొదటిసారి యిక్కడినుంచే తెలియచేసాడని ప్రతీతి.
ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవం విశేషంగా జరుగుతుంది.