యాగంటి క్షేత్రం బనగానపల్లె కి 14 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లాలో ఉంది.
యాగంటి క్షేత్రంలో పరమేశ్వరుడు పార్వతి సహితంగా ఉమామహేశ్వరుడుగా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ఉమామహేశ్వరులు ఏకశిలపై నయన మనోహరంగా కొలువుదీరి ఉన్నారు.
ఈ క్షేత్రంలో నందీశ్వరుని విగ్రహం పెద్దగా ఉంది. ఈ నందీశ్వరుని విగ్రహం పెరిగే శిలతో మలిచారు అని ప్రతీతి అందుకే నందీశ్వరుని రూపం ప్రతిష్టించినప్పటినుంచి పెరుగుతూ ఉంది.
అగస్థ్య కోనేరులో నీరు చాలా స్వచ్చంగా జలపుష్పాలతో నిర్మలంగా ఉంది.
అగస్థ్య మహర్షి ప్రతిస్టించిన శివలింగం మరియు తపస్సుచేసిన ప్రదేశం అగస్థ్య గుహలో చూడవచ్చు. అగస్థ్య గుహలోలో కి వెళ్ళి దర్సనం చేసుకోవటానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కటానికి కొంచెం కష్టంగా ఉన్నాయి.
ప్రక్కనే ఉన్న మరో గుహలో శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా దర్సించుకోవచ్చు.