29, ఏప్రిల్ 2012, ఆదివారం

తోమని పళ్ళాల వాడే వేంకటేసుడు


వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||

ఆపద మ్రొక్కుల వాడే ఆది దేవుడే వాడు
తోమని పళ్యాల వాడే దురిత దూరుడే ||

వడ్డి కాసుల వాడే వనజ నాభుడే
పుట్టు  గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు, అలమేల్మంగా వేంకటాద్రి నాథుడే ||
   
తిరుమలలో కొత్త కుండని పగలగొట్టి, ఆ కుండ పెంకులో, ప్రతిరోజు మధ్యాహ్నం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కి ప్రసాదం నివేదిస్తారు. కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి భక్తికి శ్రీనివాసుడు ముగ్ధుడై, అతను కుండ పెంకులో నివేదించిన ప్రసాదాన్ని  స్వీకరిస్తాడు. 

అందుకే తిరుమలలో కుండ పెంకులో ప్రతిరోజు మధ్యాహ్నం స్వామివారికి ప్రసాదం నివేదిస్తారు.

అందుకే అన్నమాచార్యులు కీర్తనలో తోమని పళ్యాల వాడే అని కీర్తించారు.