తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీదేవి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. పద్మావతీదేవిని శ్రీనివాసుడు మొదటిసారిగా ఉద్యానవనంలో చూసాడని, అందుకు ప్రతీకగా పద్మావతీదేవి వార్షిక పరిణయోత్సవాలు, ఉద్యానవనంలో నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలలో శ్రీనివాసుడు అశ్వ, గజ, గరుడ వాహనాల మీద దర్శనమిస్తారు.
ఈ ఉత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు.