1, మే 2012, మంగళవారం

పద్మావతీదేవి పరిణయోత్సవాలు తిరుమల



తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో  పద్మావతీదేవి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. పద్మావతీదేవిని శ్రీనివాసుడు మొదటిసారిగా ఉద్యానవనంలో చూసాడని, అందుకు ప్రతీకగా పద్మావతీదేవి వార్షిక పరిణయోత్సవాలు, ఉద్యానవనంలో నిర్వహిస్తారు.


ఈ ఉత్సవాలలో శ్రీనివాసుడు అశ్వ, గజ, గరుడ వాహనాల మీద దర్శనమిస్తారు. 


ఈ ఉత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి  8 గంటల వరకు నిర్వహిస్తారు.