శ్రీరంగనాధస్వామి శ్రీరంగపట్టణం లో, మాండ్య జిల్లా లో కర్ణాటక రాష్ట్రంలో కొలువుదీరి ఉన్నాడు. ఈక్షేత్రం పంచ రంగ క్షేత్రాలలో మొదటి క్షేత్రంగా విరాజిల్లుటుంది. ఈక్షేత్రానికే ఆది రంగ క్షేత్రం అని కూడా పేరు.
ఈ దివ్యక్షేత్రం కావేరి నది మధ్యలో ఉన్నది. పంచ రంగక్షేత్రాలు అన్నీ కావేరి నది ఒడ్డునే ఉన్నాయి.
ఈ క్షేత్రంలో మహాలక్ష్మి రంగనాయకిగా కొలువై ఉంది.ఇంకా ఈ క్షేత్రంలో నరసింహ, సుదర్శన , గోపాలకృష్ణ, శ్రీనివాస, రామ మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి.