అష్టాదశ శక్తిపీఠం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అష్టాదశ శక్తిపీఠం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జులై 2012, శుక్రవారం

శ్రీజోగులాంబ ఆలయం ఆలంపూరు

శ్రీజోగులాంబ ఆలయం కర్నూలు కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీజోగులాంబ ఆలయం కూడా ఒకటి. 


శ్రీజోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి.   శ్రీజోగులాంబ  అమ్మవారు ఆసీనురాలై,  శిరోజాలపై గబ్బిలం, బల్లి, తేలు మరియు కపాలం దర్శనమిస్తాయి.   అమ్మవారు ఉగ్రస్వరూపిణి కనుక కోనేరు పై ఆలయాన్ని నిర్మించారు.  కోనేరులో నీరు స్వచ్చంగా  ఉంది.


ఈక్షేత్రంలో పరమేశ్వరుడు బాల బ్రహ్మేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నాడు.యిక్కడ నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. 

14వ శతాబ్దంలో బహుమని సుల్థాన్స్  శ్రీజోగులాంబ   ఆలయాన్ని ధ్వంసం చేసారు. ఆప్పటినుంచి    శ్రీజోగులాంబ   అర్చా రూపాన్ని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోకి తరలించి అర్చిస్తున్నారు. 2005లో   శ్రీజోగులాంబ
ఆలయాన్ని పునరుద్దరించి మళ్ళీ  శ్రీజోగులాంబ   అర్చా రూపాన్ని పునఃప్రతిష్టించారు.


శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు శ్రీజోగులాంబ అమ్మవారి ఆలయాలు తుంగభద్రా నది ఒడ్డున ఉన్నాయి.  












                     

11, జులై 2012, బుధవారం

శ్రీభ్రమరాంబమల్లిఖార్జున ఆలయం శ్రీశైలం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరియు అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైలం ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠం ఒకే ప్రదేశంలో ఉన్న  ఏకైక క్షేత్రం శ్రీశైలం. 

సాక్షి గణపతి చేతిలో ఘంటం (కలం) మరియు పుస్తకంతో దర్శనమిస్తారు. సాక్షి గణపతి శ్రీశైల క్షేత్రాన్ని  దర్శించిన భక్తుల వివరాలు నమోదు చేసుకొంటారు అని ప్రతీతి. అందుకని శ్రీశైల క్షేత్రాన్ని  దర్శించిన భక్తుల సాక్షి గణపతిని కూడా దర్శిస్తారు. 














ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి శివానంద లహరి మరియు సౌందర్య లహరి యీక్షేత్రంలో ప్రవచించారు.  









హటకేశ్వరం ముఖద్వారం. హటకేశ్వరం పక్కనే లలితా దేవి పీఠం ఉంది. 




శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించే మరో ప్రదేశం శ్రీశైల శిఖరం. శిఖరం నుంచి నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి నందీశ్వరుని పై తిలలు వేసి  శ్రీశైల శిఖరం  దర్శిస్తే పునర్జన్మ  ఉండదు అని ప్రతీతి.









ఇక్కడ కృష్ణా నదికే పాతాళగంగ అని పేరు. పాతాళగంగ దగ్గరికి వెళ్ళా లంటే చాలా మెట్లు దిగివెళ్ళాలి. రోప్ వేలో వెళ్తే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు  ఎక్కువ మెట్లు ఎక్కి దిగనవసరం లేదు. రోప్ వే పాతాళ గంగకు వెళ్ళే మెట్ల దారిలో ఉంది. పాతాళగంగకు వెళ్ళేటప్పుడే రోప్ వే టిక్కెట్ తీసుకొంటే టూ వే టిక్కెట్  తీసుకోవచ్చు.  టూ వే టిక్కెట్ 50/- రూపాయలు. రోప్ వేలో పాతళగంగకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రోప్ వేలో పైకి రావచ్చు. ఒన్ వే టిక్కెట్   అయితే 40/- రూపాయలు. 




పడవలో షికారుకి వెళ్ళలంటే 30/- రూపాయలు తీసుకొంటారు. 15 నిమిషాలు పాతాళగంగలో పడవలో ప్రయాణించవచ్చు. 











అక్కమహాదేవి దగ్గరికి వెళ్ళటానికి టూరిజం ప్యాకేజి ఉంది. శిఖరం, సాక్షిగణపతి, హటకేశ్వరం తదితర ప్రదేశాలు సందర్శించటానికి శ్రిశైలం బస్టాండ్ నుంచి బస్స్లులు  ఉన్నాయి. ఆటో మరియు జీపులో కూడా వెళ్ళవచ్చు.


వసతి సౌకర్యం కావాలి అంటే CRO  కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఇక్కడ కులాల వారిగా సత్రాలు ఉన్నాయి. అక్కడ కూడ వసతి సౌకర్యం పొందవచ్చు.

సత్రాల నిర్వాహకులు ఉచిత అన్నప్రసాద సౌకర్యం  కల్పిస్తున్నారు. దేవస్థానం వారు ఉదయం 10 గంటలకు ఉచిత అన్నప్రసాద కూపన్లు యిస్తారు.

18, జనవరి 2012, బుధవారం

శ్రీకామాక్షి దేవి ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీకామాక్షిదేవి కొలువుదీరి ఉంది. శ్రీకామాక్షిదేవిని కామాక్షి  తాయి అని   కామాక్షి  అమ్మణ్ణ్ పిలుస్తారు.  

పూర్వం ఇక్కడ ఉండే  బంగారు  కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు.  కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.
శ్రీకామాక్షిదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశి  విశాలాక్షి శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. 

ఈ దేవాలయంలో  శ్రీకామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.

"కా" అంటే "లక్ష్మి",  "మా" అంటే "సరస్వతి", "అక్షి"   అంటే "కన్ను".   కామాక్షి దేవి  అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది.   

సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి)  మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు. 

భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం  విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం  నుంచి బయటకు వస్తుంది.                    



ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది.  ఇక్కడ ప్రతిరోజూ  ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి  హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా  లయంలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న అందరికి ప్రసాదం పంచుతారు. ఆతర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ  చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ  చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. 

శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.  ఈ ఆలయంలో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షి దేవి ముందు శ్రీ చక్రం ప్రతిష్టించారు.

శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(ఆది వరాహ ఫెరుమాళ్) ను దర్శనం చేసుకోవచ్చు.            
ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. 

108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో కల్వనూర్(ఆది వరాహ ఫెరుమాళ్) కూడా  ఒకటి. 
ఈ ఆలయంలో శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.


ముత్తుస్వామి దీక్షితార్ ప్రవచించిన కంజదళాయతాక్షి 

కంజదళాయతాక్షి కామాక్షి
కమలా మనోహరి త్రిపుర సుందరి

కుంజర గమనే మణి మండిత మంజుళ చరణే
మామవ శివ పంజర శుకి పంకజ ముఖి
గురు గుహ రంజని దురిత భంజని నిరంజని

రాకా శశి వదనే సు రదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీ కాంచన వసనే సు రసనే
శృంగారాశ్రయ మంద హసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి 
ఏకాగ్ర మనో లయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి