6, ఫిబ్రవరి 2012, సోమవారం

శ్రీత్రివిక్రమ పెరుమాళ్ ఆలయం తిరుక్కోవిలూర్


శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన పంచ కృష్ణ క్షేత్రాలలో తిరుక్కోవిలూర్ ఒకటి. ఇక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీత్రివిక్రమ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు.

ఇక్కడే కొలువుదీరిన శ్రీమన్నారాయణుడిని, మృఖండ  మహర్షి శ్రీత్రివిక్రమ పెరుమాళ్ గా పూజించాడని ప్రతీతి.  
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,  శ్రీత్రివిక్రమ పెరుమాళ్  ఆలయం కూడా ఒకటి.   

ఈ ఆలయం చోళ రాజైన పరాంతక చోళచే నిర్మించబడి ,రాజ రాజ చోళ I , రాజ రాజ చోళ II మరియు రాజేంద్ర దేవ చోళచే విశేషంగా అభివృధ్ధి చేయబడింది. 

శ్రీత్రివిక్రమ పెరుమాళ్  చతుర్భాహువులతో,  కుడి చేతిలో శంఖు, ఎడమ చేతిలో చక్రం ధరించి, కుడి కాలు ఆకాశం పైన పెట్టి, కుడి చేతి చూపుడు వేలుతో 1 అని చూపిస్తూ నయనమనోహరంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మి పుష్పవల్లిగా కొలువుదీరి ఉంది. 


ఇక్కడే కొలువుదీరిన లక్ష్మినారాయణ, లక్ష్మినరసింహ, ఆండాళ్,  ఉదయవర్,  చక్రత్తాళ్వర్, వరదరాజ, వేణుగోపాల మరియు శ్రీరాముడిని దర్శించవచ్చు. ఈ ఆలయంలో  శ్రీత్రివిక్రమ పెరుమాళ్ అర్చా రూపం వెనక ఉన్న చిన్న వామనమూర్తి కూడా ఉన్నారు. 

ఇక్కడే కొలువైన    శ్రీత్రివిక్రమ పెరుమాళ్  ఉత్సవమూర్తి కి గోపాలుడు అని పేరు.     

నాదముని నాలాయిర  దివ్య ఫ్రభంధం  లేక ద్రవిడ వేదం ని ప్రపంచానికి మొట్టమొదటిసారి యిక్కడినుంచే తెలియచేసాడని ప్రతీతి.   

ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవం విశేషంగా జరుగుతుంది.          

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన పంచ కృష్ణ క్షేత్రాలు


పంచ కృష్ణ క్షేత్రాలులో శ్రీకృష్ణ పరమాత్మ   కొలువై ఉన్నాడు.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,    పంచ కృష్ణ క్షేత్రాలు  కూడా ఉన్నాయి.
తిరుక్కోవిలూర్ లో  శ్రీత్రివిక్రమ (ఉలగళంద/వామన) పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణపురంలో శౌరిరాజన్ నీలమేఘ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణన్ కుడిలో  శ్రీలోకనాధ్  పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణమంగైలో శ్రీభక్తవత్సల పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణన్ కపిస్థలంలో శ్రీగజేంద్ర వరదార్  పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు
పంచ కృష్ణ క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి.

30, జనవరి 2012, సోమవారం

శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీమహావిష్ణువు శ్రీఅష్టభుజ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆదికేశవ పెరుమాళ్  అని కూడా ప్రతీతి.

శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,   శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి

ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు   అష్ట భుజాలతో కొలువుదీరిఉన్నారు. కుడివైపున ఉన్న చతుర్భుజాలలో సుదర్శన చక్రం,  ఖడ్గం,  పుష్ఫం, బాణం ధరించి,  ఎడమవైపున ఉన్న చతుర్భుజాలలో      శంఖు, ధనస్సు , డాలు మరియు గధ  ధరించి నయనమనోహరంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మి అలమేలుమంగగా కొలువుదీరి ఉంది.         

బ్రహ్మ దేవిని తపస్సుని భగ్నం చెయ్యటానికి సరస్వతీ దేవి రాక్షసులని పంపిస్తుంది. శ్రీమన్నారాయణుడు  సరస్వతీ దేవి పంపిన  రాక్షసులని సంహరిస్తాడు. కోపోద్రిక్తురాలైన  సరస్వతీ దేవి  సర్పాన్ని పంపిస్తుంది. శ్రీమన్నారాయణుడు  అష్టభుజాలతో, దివ్యాయుధాలు  ధరించి సర్పాన్ని కూడా సంహరించి బ్రహ్మ దేవిని తపస్సు నిర్విగ్నంగా కొనసాగేవిధంగా చేస్తాడు.  

ఈ ఆలయంలో శ్రీమన్నారయణుడు  సంహరించిన సర్ఫం యొక్క ఉపాలయన్ని కూడా దర్శించవచ్చు.   

ఈ ఆలయంలో కొలువుదీరిన  భూవరాహ, ఆండాళ్ మరియు హనుమని కూడా దర్శించవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణికి గజేంద్ర ఫుష్కరణి అని పేరు. ఈ ఆలయంలో లో వివిధ అకృతులలో  మలచిన శిల్పసంపద  కడు రమణీయం.  

ఇక్కడ  ఉన్న మరో విశేషం శ్రీఅష్టభుజ పెరుమాళ్  పరమపద ద్వారాలు నుంచి దర్శనమివ్వటం.