తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి,కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవిల్ లు పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు
తిరువణ్ణామలై లో పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు గా వెలిసాడు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ అగ్ని లింగం రూపం లో దర్శనమిస్తాడు.
శ్రీకాళహస్తి లో పరమేశ్వరుడు వాయు లింగ రూపం లో దర్శనమిస్తాడు.
కాంచీపురం లో
ఏకామ్రేశ్వర్ గా కొలువై పృధ్వి లింగ రూపం లో దర్శనమిస్తాడు.
చిదంబరం లో ఆకాశ (నిరాకార) రూపం లో దర్శనమిస్తాడు.
తిరువనైకోవిల్ (జంబుకేశ్వర్)లో జల లింగం రూపం లో దర్శనమిస్తాడు.
తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవిల్ లు తమిళనాడు లో ఉంటే, శ్రీకాళహస్తి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి