13, జనవరి 2012, శుక్రవారం

ఆకాశగంగ తిరుమల



తిరుమల లో ఉన్న పవిత్ర పుణ్యతీర్థాలలో  ఆకాశగంగ  విశిష్టమైనది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి అర్చా మూర్తికి  ఈ పుణ్య జలంతోనే అభిషేకం జరుపుతారు.


శ్రీవేంకటేశ్వర స్వామి వారే ఈ ఆకాశగంగ ను తిరుమల నంబికి చూపించి,  ఇప్పటినుంచి ఈ జలముతోనే అభిషేకం జరపమని చెప్పాడు. అప్పటివరకూ పాపనాశనం జలము తో అభిషేకం జరిపేవారు.


శ్రీవేంకటేశ్వర స్వామి కోరికమేరకు అప్పటినుంచి ఆకాశగంగా జలంతోనే స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. 

అప్పటినుంచి తిరుమల నంబి కుటుంబీకులు శ్రీవారి అభిషేకానికి ఆకాశగంగా జలం బిందెలు తల పై పెట్టుకొని ధవళ వర్ణ ఛత్రాలతో కూడి తిరుమల ఆలయానికి తీసుకొనివస్తారు.

ఆకాశగంగా జలం స్వచ్ఛంగా ఉంటుంది.

ఆకాశగంగ కు వెళ్ళటానికి బస్ లు ఉన్నాయి. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి