ఇక్కడ జాపాలి ముని తపస్సు చేసాడు అందుకే ఆ ముని పేరు మీద ఇక్కడ ఉన్న తీర్థం జాపాలి తీర్థం అని పిలుస్తారు అని ప్రతీతి. ఇక్కడే అంజనా దేవి తపస్సు చేసుకొనేది అని కూడా చెప్తారు.
జాపాలి హనుమాన్ ఆలయం జాపాలి తీర్థం దగ్గర ఉన్నది. ఈ జాపాలి హనుమాన్ ఆలయం హధీరాం మఠం చే నిర్వహించబడుతుంది.
జాపాలి తీర్థం వెళ్ళాలంటే మెట్ల మార్గం నుంచి 1 కిలోమీటర్ అయినా నడిచి వెళ్ళాలి.
తిరుమల నుంచి జాపాలి తీర్థం కి బస్ లో వెళ్ళవచ్చు. బస్ దిగిన తర్వాత 1 కిలోమీటర్ అయినా నడిచి వెళ్ళాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి