కాంచీపురంలో ఉన్న వైష్ణవ ఆలయాలలో శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయం అత్యంత విశిష్టమైనది. శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయంలో శ్రీమన్నారాయణుడు అర్చామూర్తి రూపంలో కొలువుదీరి ఉన్నాడు.
ఈ ఆలయాన్ని పల్లవ రాజైన నందివర్మన్ నిర్మించాడు. ఈ ఆలయానికి పరమేశ్వర విష్ణుగృహ అని కూడా పేరు. ఆలయ ముఖద్వారంపై వినమ్రంగా ముకుళిత హస్తాలతో గరుడాళ్వార్ దర్శనమిస్తారు. ఆలయ గోడలపై చెక్కిన చిత్రాలు చోళులు మరియు పల్లవుల యుద్ధగాధని కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి.
స్ధంభాలలో ఠీవిగా కొలువుదీరిన మృగరాజులు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ ఆలయ నిర్మాణశైలి చాలా విశిష్టంగా ఉంది.
శ్రీమహావిష్ణువు వివిధరూపాలలో దర్శమిస్తారు. శ్రీమహావిష్ణువుని కూర్చొని, నిలబడి, యోగనిద్రలో కొలువుదీరిన అర్చారూపాలు నయనమనోహరంగా దర్శమిస్తాయి. ఇదే ఆలయంలో కొలువుదీరిన శ్రీమహాలక్ష్మిని కూడా దర్శించవచ్చు. ఈ ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న స్ధంభాలు, గోడలపై కొలువుదీరిన శిల్పాలు నయనమనోహరంగా ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో విశాలమైన కోనేరు ఉంది.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమన 108 దివ్యదేశాలలో శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయం ఒకటి. తిరుమంగై ఆళ్వార్ శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించి మంగళాశాసనం చేసారు.
Thanks for your post. It remembered good old days when I studied my PG in kancheepuram. We stayed next house of this temple for an year.
రిప్లయితొలగించండిnice to hear Vamsi Krishna :)
రిప్లయితొలగించండి