శ్ర్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరమొ ఫాల్గునమాసం శుద్ద ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు సాయంసంధ్య వేళ శ్రీమలయప్పస్వామి భూదేవి శ్రీదేవి సమేతుడై తిరుమల పుష్కరిణిలో విహరిస్త్తారు. ఈ తెప్పోత్సవాలు జరిగే రోజుల్లో వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పున్నమి గరుడసేవని రద్దు చేస్తారు. పుష్కరిణి మెట్లపై కూర్చుని తెప్పోత్సవాలు వీక్షించటానికి భక్తులని అనుమతిస్తారు.
శ్రీమలయప్పస్వామి భూదేవి శ్రీదేవి సమేతుడై ఏకాదశి నుంచి చతుర్ధశి వరకు, ప్రతిరోజు పుష్కరిణిలో 5సార్లు తెప్పపై విహరిస్తారు. తెప్పోత్సవాల ఆఖరి రోజైన పౌర్ణమి రోజున 95సార్లు తెప్పపై విహరిస్తారు. విధ్యుత్ దీపకాంతుల నడుమ భక్తుల గోవింద నామస్మరణతో, అన్నమాచార్య కీర్తనలతో కడురమణీయంగా తెప్పోత్సవాలు జరుగుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి